తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్ - Of the four railway hospitals in South Central Railway under Ayushman Bharat Yojana Scheme

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న 'ఆయుష్మాన్ భారత్- ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం దక్షిణ మధ్య రైల్వే పరధిలో అందుబాటులోకి వచ్చింది.

దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్

By

Published : Nov 21, 2019, 7:35 PM IST

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద దక్షిణ మధ్య రైల్వేలోని నాలుగు రైల్వే ఆసుపత్రులలో లబ్దిదారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సెంట్రల్ ఆసుపత్రి, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్​లోని డివిజనల్ రైల్వే ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందవచ్చు.

ఆయుష్మాన్ ఆరోగ్య యోజన కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల విలువైన వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 10.74 కోట్ల కుటుంబాలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య ఏజెన్సీల మధ్య ఒప్పందం జరిగింది. దానికనుగుణంగా లబ్ధిదారులు వైద్య సేవలు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్

ఇదీ చూడండి : హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details