తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇవి పాటిస్తే కరోనాను వంద శాతం అరికట్టవచ్చు' - కరోనా వైరస్​పై అవగాహన

ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించటం ద్వారా కరోనా వైరస్​ను వంద శాతం దూరం చేయవచ్చని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్​ ఎం.వి.రావు తెలిపారు. ఇప్పటి వరకున్న లెక్కల ప్రకారం ఈ వైరస్​ సోకిన వారిలో మరణాల సంఖ్య కేవలం ఒక్క శాతమే అని స్పష్టం చేశారు.

'వ్యక్తిగత శుభ్రతతో కరోనాను వంద శాతం అరికట్టవచ్చు'
'వ్యక్తిగత శుభ్రతతో కరోనాను వంద శాతం అరికట్టవచ్చు'

By

Published : Mar 5, 2020, 2:50 PM IST

కరోనా వైరస్‌ విషయంలో భయాందోళనలు అవసరం లేదని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎం.వి.రావు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వైరస్‌ సోకిన వారిలో కేవలం ఒక్క శాతం మాత్రమే మరణాల సంఖ్య ఉందని.. మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులతో పోలిస్తే ఇది చాలా స్వల్పమని ఆయన తెలిపారు. ఈ వైరస్‌ సోకినా పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించటం ద్వారా వంద శాతం ఈ వైరస్‌ను దూరం చేయవచ్చంటోన్న డాక్టర్‌ ఎం.వి.రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'వ్యక్తిగత శుభ్రతతో కరోనాను వంద శాతం అరికట్టవచ్చు'

ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details