ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజం శాఖ అవార్డులను వివిధ విభాగాలకు అందిస్తునట్లు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా సమయం లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. లాక్ డౌన్ తర్వాత విదేశీ పర్యాటకులు, యాత్రికులకు హోం క్వారంటైన్ లో హైదరాబాద్ లోని హోటల్స్, తెలంగాణ టూరిజం ప్రముఖ పాత్ర పోషించాయన్నారు.
టూరిజం అభివృద్ధి కోసం...
భవిష్యత్ లో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో సీఎం కేసీఆర్ టూరిజం అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాళేశ్వరం, మేటిగడ్డ, అన్నారం, మిడ్ మానేరు, కోయిల్ సాగర్, కరివేన, ఉద్దండపూర్, లక్నవరం లాంటి రిజర్వాయర్ ల వద్ద టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు సోమశిల, పాకాలలలో టూరిజం అభివృద్ధి చేశామన్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్, ఫణిగిరి, కోటిలింగాలలలో బుద్ధిజం అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించామన్నారు.
ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్...