తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. అటవీ అధికారి అనితపై దాడి మరిచిపోకముందే సూర్యాపేట జిల్లా గుండ్లపల్లిలో వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.

By

Published : Jul 6, 2019, 11:27 PM IST

షేక్ సైదా

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కృష్ణ పరివాహక ప్రాంతమైన గుండ్లపల్లి, రఘునాధపాలెంలో ఇసుక రీచ్​లో ఎలాంటి అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఇసుక, సున్నపురాయిని తరలిస్తున్నారు. వీఆర్ఏ షేక్ సైదా ఇసుక ట్రాక్టర్​ అడ్డుకోవడం వల్ల అధికార పార్టీ కార్యకర్తలు వీఆర్ఏపై దాడి దిగి మోటార్ సైకిల్, చరవాణిని ధ్వంసం చేశారు. ఈ విషయమై వీఆర్ఏ షేక్ సైదా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details