తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎంలో రూ.10 వేలు నొక్కితే రూ.4 వేలే చేతికి - TElangana news

ఓ ఏటీఎంలో రూ.10 వేలు నమోదు చేస్తే రూ.4 వేలు, రూ.5 వేలకు రూ.2 వేలు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కయిన ఘటన అమీర్​పేటలో చోటుచేసుకుంది.

ఏటీఎంలో రూ.10 వేలు నొక్కితే రూ.4 వేలే చేతికి
ఏటీఎంలో రూ.10 వేలు నొక్కితే రూ.4 వేలే చేతికి

By

Published : Jan 4, 2021, 9:55 AM IST

ఓ ఏటీఎంలో నమోదు చేసినంత కాకుండా.. తక్కువ నగదు వస్తుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అమీర్​పేట బీకేగూడ నెహ్రూనగర్‌ కూడలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి ఆదివారం సాయంత్రం రూ.10 వేలు నమోదు చేస్తే రూ.4 వేలు, రూ.5 వేలకు రూ.2 వేలు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కయ్యారు.

నమోదు చేసిన మొత్తం విత్‌డ్రా అయినట్లు సందేశాలు రాగా కంగారుపడ్డారు. 30 మందికి పైగా ఖాతాదారులు ఈ సమస్యను ఎదుర్కొని, ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏటీఎం వచ్చి పనిచేయడం లేదని బోర్డు పెట్టారు. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగి ఉండొచ్చవని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకంణ

ABOUT THE AUTHOR

...view details