తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వాయిదా వేశారు. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం సభలో అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఛైర్మన్గా ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్లను ప్రకటించారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించారు. సభ మొత్తం 58.06 గంటల పాటు కొనసాగింది. మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానానికి ఆమోదం లభించింది.
ఏఏ కమిటీలకు.. ఎవరెవరు ఛైర్మన్లు అంటే...
క్రమ సంఖ్య | పేరు | కమిటీ |
1 | పోచారం శ్రీనివాస్ | 1)శాసనసభ నిబంధనల కమిటీ ఛైర్మన్ 2)వసతుల కమిటీ ఛైర్మన్ 3)వన్యప్రాణి, పర్యావరణ సంరక్షణ కమిటీ ఛైర్మన్ |
2 | అక్బరుద్దీన్ ఒవైసీ | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ |
3 | సోలిపేట లింగారెడ్డి | అంచనాల కమిటీ ఛైర్మన్ |
4 | ఆశన్నగారి జీవన్రెడ్డి | పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఛైర్మన్ |
5 | ఉపసభాపతి పద్మారావు | 1)ప్రివిలైజెస్ కమిటీ ఛైర్మన్ 2)పిటిషన్ల కమిటీ ఛైర్మన్ |
6 | గుత్తా సుఖేందర్ రెడ్డి | మండలి నిబంధనల కమిటీ ఛైర్మన్ |
7 | నేతి విద్యాసాగర్ | 1)మండలి ప్రివిలైజెస్ కమిటీ ఛైర్మన్ 2)మండలి పిటిషన్ల కమిటీ ఛైర్మన్ |
8 |