జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎం ప్రచార జోరు కొనసాగుతోంది. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగిన ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. రెడ్ హిల్స్లో పాదయాత్ర నిర్వహించారు.
వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్ ఒవైసీ - రెడ్హిల్స్లో ఎమ్ఐఎమ్ ప్రచారం
గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎం పార్టీ ప్రచార జోరు కొనసాగుతోంది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రచారంలోకి దిగారు. రెడ్ హిల్స్ కాలనీలో పాదయాత్ర చేపట్టి పతంగి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
![వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్ ఒవైసీ asaduddin campaign in red hills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9657479-403-9657479-1606285898851.jpg)
వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్ ఒవైసీ
పతంగి గుర్తుకే ఓటు వేసి గెలిపించి, మరోసారి ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితులందరికీ సాయమందేలా చేయడంతో పాటు డివిజన్లలో అభివృద్ధికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.