తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2020, 7:35 PM IST

Updated : Sep 26, 2020, 10:50 PM IST

ETV Bharat / state

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ రాక.. శ్రేణుల్లో ఉత్సాహం

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్కమ్ ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్​ వచ్చారు. ఈ సందర్భంగా ఠాగూర్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో మాణిక్కమ్ ఠాగూర్‌ పాల్గొన్నారు.

arrival-of-telangana-congress-incharge-manickam-tagore-in-hyderabad
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ రాక.. శ్రేణుల్లో ఉత్సాహం

ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యులు మానిక్కమ్ ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్​లోని గాంధీభవన్ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ రాక.. శ్రేణుల్లో ఉత్సాహం

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఠాగూర్ నేరుగా గాంధీభవన్​కు చేరుకున్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో మాణిక్కమ్ పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్​తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. కాంగ్రెస్ నేతలంతా టీమ్ వర్క్​గా పని చేస్తే రాబోయే ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తామని మనిక్కమ్ ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు.

ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడిగా నియామకం అయిన తర్వాత మనిక్కమ్ ఠాగూర్ గాంధీభవన్​కు తొలిసారి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. నెలలో రెండు సార్లు తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని విషయాలు అందులో చర్చించుకుందామన్నారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చని.. అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :పేదింటి బిడ్డకు పెద్ద జబ్బు... ఆదుకోండి ప్లీజ్​...!

Last Updated : Sep 26, 2020, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details