రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ట్యాంక్ పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నించిన గొర్రెల కాపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీస్ ముందు జీఎంపీఎస్ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష చేపట్టేందుకు యత్నించారు.
'పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నం... నిరసనకారుల అరెస్ట్' - Hyderabad GMPS Shepherds Arrest
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ... గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్) ఆధ్వర్యంలో ముట్టడికి విజ్ఞప్తి చేశారు.
!['పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నం... నిరసనకారుల అరెస్ట్' Arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6268392-98-6268392-1583148711131.jpg)
Arrest
నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్కి తరలించారు. రెండో విడత గొర్రెలను వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో... ప్రభుత్వం మెడలు వంచి తీసుకుంటామని గొర్రెల కాపరులు హెచ్చరించారు.
'పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నం... నిరసనకారుల అరెస్ట్'
ఇదీ చూడండి:హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు