తెలంగాణ

telangana

ETV Bharat / state

బీర్​ సీసాతో దాడి కేసులో నిందితుల అరెస్ట్​

ఫాస్ట్ ఫుడ్ మాస్టర్​పై బీర్ సీసాతో దాడి చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను బోయిన్​పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్​కు తరలించారు.

By

Published : Aug 6, 2019, 11:43 PM IST

నిందితులు

ఒడిశాకు చెందిన సోఫైన్ అలీ బోయిన్​పల్లి మస్తాన్ పాయింట్ చౌరస్తాలోని ఒక బేకరీ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాస్టర్​గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 11 గంటలకు పనులు ముగించుకుని వెళ్తున్న తరుణంలో నోట్ పాడ్​కు చెందిన కిశోర్ మద్యం మత్తులో తనకు మంచూరియా కావాలని అడిగాడు. మంచూరియా లేదని షాపు మూసేవేసే టైం అయిందని వారు చెప్పినప్పటికీ వినకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. అలీ అన్న నహీం కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకుండా బీరు సీసాతో ఇద్దరిపై దాడి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details