తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఆర్మీ జవాను మృతి - అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

ఆరోగ్యం బాలేదని సికింద్రాబాద్ ఆసుపత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికి గల కారణాలు వైద్యులకు కూడా తెలియరాలేదు.

అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

By

Published : Aug 6, 2019, 1:52 PM IST

అనుమానాస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మురళి జమ్ముకశ్మీర్​లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహించేవారు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడం వల్ల... హైదరాబాద్​ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మరణించాడు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండేదని... అతను ఏ కారణం చేత చనిపోయాడో అనే విషయాన్ని వైద్యులు కూడా సరిగా ధ్రువీకరించలేకపోవడం తమకు బాధ కలిగిస్తోందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

ABOUT THE AUTHOR

...view details