తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2020, 11:39 AM IST

ETV Bharat / state

ఏపీటీడీసీ బస్సు ఎక్కండి.. వసతి, ఆతిథ్యం, దర్శనం పొందండి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తమ సంస్థ ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చే యాత్రికులకు వసతి, ఆతిథ్యం ఇవ్వడంతో పాటు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించనుంది. తిరుచారునూరులో 200 గదులతో సరికొత్త భవనాన్ని తీసుకుంది. ఇకపై రోజూ 2 వేల మందిని తిరుపతికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తోంది.

aptdc thirumala
ఏపీటీడీసీ బస్సు ఎక్కండి.. వసతి, ఆతిథ్యం, దర్శనం పొందండి

ఏపీటీడీసీ బస్సు ఎక్కండి.. వసతి, ఆతిథ్యం, దర్శనం పొందండి

తిరుమల వెళ్లే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థకి చెందిన బస్సుల్లో వచ్చే వారందరికీ ఇక సొంతంగా వసతి, ఆతిథ్యంతో పాటు స్వామి దర్శనం కల్పించనున్నారు. తిరుచారునూరులో 70 కోట్లతో నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విశాలమైన ఏడు అంతస్తుల పద్మావతి నిలయాన్ని ఏపీటీడీసీ తీసుకుంది.

800మందికి పైగా రాకపోకలు

ఏటా కోటి రూపాయలు అద్దె చెల్లించే ఈ భవనంలో 80 ఏసీ, 120 నాన్​ ఏసీ కలిపి మొత్తం 200 గదులు అందుబాటులో ఉంటాయి. అన్ని సదుపాయాలతోపాటు భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో భవనాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, కరూరు, కుంభకోణం తదితర చోట్ల నుంచి వివిధ ప్యాకేజీల్లో ఏపీటీడీసీకి చెందిన బస్సుల్లో రోజూ 800 నుంచి 1000 మంది తిరుపతి చేరుకుంటున్నారు. వీరందరికీ ఇప్పటివరకు ప్రైవేట్ హోటళ్లలో వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

బస చేసే విధంగా ప్యాకేజీ..!

తితిదేతో ఒప్పందం ప్రకారం కేటాయిస్తున్న స్లాట్లలో 300 రూపాయల టికెట్​పై స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. పద్మావతి నిలయం ప్రారంభమయ్యాక రోజూ 2 వేల మంది భక్తుల్ని తిరుపతికి తీసుకెళ్లేలా పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున బస్సుల్లో భక్తులను తీసుకొచ్చి... ప్రైవేట్ హోటళ్లలో వీరంతా కాలకృత్యాలు తీర్చుకున్నాక తిరుమల కొండ పైకి తీసుకెళ్లి స్వామి దర్శనం కల్పిస్తున్నారు. ఇక నుంచి అవసరమైతే ఒక రోజు రాత్రి బస చేసే విధంగా కూడా ప్యాకేజీ రూపొందిస్తున్నారు.

రోజూ 1500 నుంచి 2 వేల మంది 300 రూపాయల టికెట్​పై స్వామి దర్శనం చేసుకునేలా తితిదే నుంచి అనుమతి కోసం యత్నిస్తున్నారు. ఈ మేరకు త్వరలో ఆన్​లైన్ బుకింగ్ భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.

ఇదీ చదవండి :నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details