కరోనా కష్టకాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది వైద్యులు కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. సంజీవ్సింగ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో యాక్ట్ నౌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలువురు వైద్యులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక అవార్డులతో సన్మానించారు.
వైద్యులకు అబ్దుల్ కలాం స్మారక అవార్డు - award to doctors who helped in corona times
హైదరాబాద్ హైటెక్స్లో యాక్ట్ నౌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలువురు వైద్యులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక అవార్డును సన్మానించారు. కరోనా కష్టకాలంలో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులకు ఈ పురస్కరాన్ని అందిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. సంజీవ్సింగ్ యాదవ్ అన్నారు.

కరోనా కాలంలో సేవలందించిన వైద్యులకు అబ్దుల్ కలాం స్మారక పురస్కారం
వైద్యులందరూ కమర్షియల్ కాదని.. ప్రజలకు అంకితభావంతో లాభాపేక్ష లేకుండా సేవలు అందించే వైద్యులు సమాజంలో ఎంతో మంది ఉన్నారని సంజీవ్సింగ్ యాదవ్ అన్నారు. కరోనా కాలంలో విశిష్ట సేవలందిస్తున్న 100 మంది వైద్యులను సన్మానించేందుకు నిర్ణయించామని అందులో 80 మందిని ఇప్పటికే సన్మానించినట్లు పేర్కొన్నారు. గొప్ప మానవతావాది అయిన అబ్దుల్ కలాం అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆవార్డుగ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిఃకరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్!