ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధానిగా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ అసెంబ్లీ చరిత్రలో చారిత్రక రోజు అని.. స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం - AP LEGISLATURE APPROVED CAPITAL DECENTRALIZATION BILL
ఆంధ్రప్రదేశ్లో పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం.

CAPITAL DECENTRALIZATION BILL
ఇవీ చూడండి : రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు