అమర్రాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమర్రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు 483 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే భూమిని వినియోగించుకోవడం లేదంటూ.. 253 ఎకరాల్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ.. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ జూన్ 30 జీవో నెంబర్ 33 జారీ చేశారు.
'అమర్రాజా భూముల వ్యవహారంలో ప్రభుత్వ జీవో రద్దు' - అమర్రాజా భూముల వ్యవహారం తాజా వార్త
అమర్ రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఆ సంస్థకు 483 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా.. వినియోగించడం లేదని.. 253 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై అమర్ రాజా సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని అమర్ రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భూముల్ని వెనక్కు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఆ భూముల్లో రూ.2,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని.. భూములు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాల్లో వాస్తవం లేదన్నారు. అయితే ప్రభుత్వ చొరవతోనే ఏపీఐఐసీ ఆ సంస్థకు భూములు కేటాయించిందని.. వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ తరఫు ఏజీ వాదించారు. జీవోనూ సస్పెండ్ చేయొద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ చూడండి :రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు