న్యాయమూర్తుల ఫోన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ దాఖలైన పిల్ను కొట్టేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ గురువారం ఏపీ హైకోర్టులో కౌంటర్ వేశారు. ఆ పిల్ను కొట్టేయాలని కోరారు. ‘ఫోన్ ట్యాపింగ్ను పర్యవేక్షించేందుకు ఇద్దరు పోలీసు అధికారుల్ని ప్రభుత్వం నియమించిందన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదు. ఓ పత్రిక ప్రచురించిన నిరాధార కథనం ఆధారంగా పిటిషనర్ నిమ్మిగ్రేస్ పిల్ దాఖలు చేశారు. ఆ కథనం ప్రచురించినందుకు లీగల్ నోటీసు ఇచ్చాం. ఆ కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండిస్తున్న విషయాన్ని ఏజీ.. హైకోర్టు సీజేకు ఫోన్ చేసి చెప్పారు’ అని కౌంటర్లో పేర్కొన్నారు.
'న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్పై పిల్ను కొట్టేయండి' - AP High Court Latest News
హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. కాగా ఈ పిటిషన్లో వాస్తవం లేదని... ఓ పతిక్ర కథనం ఆధారంగా పిటిషనర్ నిమ్మిగ్రేస్ పిటిషన్ దాఖలు చేశారని న్యాయస్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు.
!['న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్పై పిల్ను కొట్టేయండి' ap High Court hearing on judges phone tapping pills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9105652-543-9105652-1602197101162.jpg)
ap High Court hearing on judges phone tapping pills
హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.