తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2021, 6:33 PM IST

ETV Bharat / state

రేషన్ పంపిణీ వాహనాల ఫొటోలు సమర్పించండి: ఏపీ హైకోర్టు

ఏపీ ఎస్​ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ రేషన్ పంపిణీ వాహనాలకు రంగుల మార్పుపై ఏపీ హైకోర్టులో వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ వాహనాల ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వాటిపై జగన్ ఫొటో ఉందా అని ఆరా తీసింది.

ap high-court-hearing-about-ration-transport-vehicles-colour-changing-case on tuesday in andhra pradesh
రేషన్ పంపిణీ వాహనాల ఫొటోలు సమర్పించండి: ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్​లో రేషన్‌ పంపిణీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఏపీ ఎస్​ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. వైకాపా ప్రభుత్వం ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్​పై మంగళవారం విచారణ జరిగింది. రంగుల మార్పు ఖర్చుతో కూడుకున్న పని కాగా.. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని జగన్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వాహనాలపై ఏపీ సీఎం జగన్ ఫొటోలు ఉన్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం.. వాటి ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించాలని జగన్ సర్కార్​ని ఆదేశించింది.

ఇదీ చదవండి:కొత్త పార్టీలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్: షబ్బీర్‌ అలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details