తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 1:55 PM IST

ETV Bharat / state

మీడియాతో మాట్లాడేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి

మీడియాతో మాట్లాడేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని ఆదేశించింది.

ap-high-court-allowed-minister-peddireddy-ramachandra-reddy-to-speak-to-the-media
మీడియాతో మాట్లాడేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ మీడియాతో మాట్లాడకూడదన్న ఏపీ ఎస్‌ఈసీ ఆదేశాలను సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయగా... మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది.

ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని ఏపీ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఈసీ, కమిషనర్‌ లక్ష్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని పెద్దిరెడ్డిని ఆదేశించింది.

అనుబంధ కథనాలు:పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం.. మొదటి విడతలో భారీ పోలింగ్

ABOUT THE AUTHOR

...view details