ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తున్నట్లు గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీ ప్రొరోగ్.. ఆ రెండు బిల్లుల పరిస్థితేంటి.! - వికేంద్రీకరణ బిల్లు ఆర్టినెన్స్ యోచన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్రన్ నోటిఫికేషన్ విడుదలచేశారు. వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీపై వివాదం జరుగుతోన్న తరుణంలో ప్రొరోగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు కీలక బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ప్రొరోగ్.. ఆ రెండు బిల్లుల పరిస్థితేంటీ.!
అసెంబ్లీని ప్రొరోగ్ చేసి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. వీటిపై సెలెక్ట్ కమిటీ వివాదం జరుగుతోన్న నేపథ్యంలో ప్రోరోగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:'చాలా వచ్చాయి.. అన్నింటినీ అడ్డుకున్నామా..?'