తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి - ఏపీలోని తిరుపతి దేవస్థానం తాజా వార్తలు

ap governmentstate permitted for darshans in tirumala
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి

By

Published : Jun 2, 2020, 2:14 PM IST

Updated : Jun 2, 2020, 4:17 PM IST

14:12 June 02

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. తితిదే ఉద్యోగులు, స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతివ్వాలని నిర్ణయించింది.  భక్తులు భౌతిక దూరం పాటించాలని సూచించింది. తితిదే ఈవో రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో.. తిరుమలలో శ్రీవారి దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 12న తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. లేఖపై స్పందించిన ప్రభుత్వం ఈ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదీచూడండి: 'ప్రభుత్వం రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

Last Updated : Jun 2, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details