తెలంగాణ

telangana

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్​తో జగన్ భేటీ

By

Published : Dec 16, 2020, 12:32 PM IST

దిల్లీలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు.

ap cm jagan tour in delhi
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్​తో జగన్ భేటీ

దిల్లీలో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. కేంద్రమంత్రి‌తో సుమారు అరగంటపాటు ఏపీ సీఎం సమావేశమయ్యారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.55,656 కోట్లను ఆమోదించాలని కోరారు. భూసేకరణ, పునరావాస పనులకు అయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కోరారు.

ఇదీ చూడండి:పీఆర్‌సీపై చర్చలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్‌

ABOUT THE AUTHOR

...view details