ETV Bharat / state
నేడు రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు - రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.


ఆంధ్రప్రదేశ్
By
Published : Feb 12, 2019, 9:14 AM IST
| Updated : Feb 12, 2019, 10:35 AM IST
దీక్ష అనంతరం దిల్లీలోనే బసచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు. నేతలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లి.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించనున్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకాకులు కారని.. దేశం మొత్తం అండగా ఉందన్న విషయం స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో చివరి ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. Last Updated : Feb 12, 2019, 10:35 AM IST