తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2020, 3:54 PM IST

Updated : Jun 15, 2020, 5:08 PM IST

ETV Bharat / state

మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​

15:38 June 15

మరో శాసన సభ్యుడికి కరోనా... ఎమ్మెల్యే​ గణేశ్​ గుప్తాకు పాజిటివ్

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే గణేశ్​ గుప్తాకు పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇప్పటికే జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​కు కొవిడ్​-19 పాజిటివ్​ వచ్చింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​తో కలిసి కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాల్లో గణేష్ గుప్తా పాల్గొన్నారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడం సహా బాజిరెడ్డికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైన నేపథ్యంలో గణేష్ గుప్తా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితంగా గుప్తా కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కొవిడ్ నిర్థరణ కాగా అంతా అధికార పార్టీకి చెందినవారే. 

Last Updated : Jun 15, 2020, 5:08 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details