అత్యంత అనువైన ధరలలో నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించేందుకు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యూవెలరీ షాప్ ప్రారంభోత్సవానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రేమ్ రాజ్ శాంతిలాల్ పేరుతో నెలకొల్పిన ఈ బంగారు ఆభరణాల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. బంగారు ఆభరణాల అమ్మకంలో తమదైన శైలిని, నూతన ఒరవడిని తీసుకొస్తామని నిర్వాహకులు తెలిపారు. నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉండేవిధంగా తమ షాపును పెట్టామని... ప్రజలంతా తమను ఆదరించాలని దుకాణం నిర్వాహకులు కోరారు.
సిటీలో మరో బంగారు ఆభరణాల దుకాణం
సికింద్రాబాద్లోని బంగారు ఆభరణాల దుకాణాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
సిటీలో మరో బంగారు ఆభరణాల దుకాణం