తెలంగాణ

telangana

ETV Bharat / state

Another DA to TSRTC Employees : TSRTC ఉద్యోగులకు గుడ్​న్యూస్.. మరో విడత కరవుభత్యం ఇవ్వాలని నిర్ణయం - తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజా వార్తలు

Another DA to TSRTC Employees : టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆ సంస్థ తీపికబురు అందించింది. మరో విడత కరవుభత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి కరవుభత్యాన్ని టీఎస్ఆర్టీసీ చెల్లించనుంది.

TSRTC latest news
Good News For TSRTC Employees in Telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 10:29 PM IST

Another DA to TSRTC Employees : టీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగులకు గుడ్​న్యూస్ చెప్పింది. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మరో విడత కరవుభత్యం(డీఏ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి కరవుభత్యాన్ని టీఎస్ఆర్టీసీ చెల్లించనుంది. పెండింగ్​లో ఉన్న ఎనిమిదవ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8డీఏలను మంజూరు చేసింది. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు.

TSRTC MD sajjanar interview : 'ప్రయాణికులకు దగ్గరవ్వడమే మా ప్రధాన లక్ష్యం'

తెలంగాణఆర్టీసీ సంస్థ ఎండీగా వీసీసజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ సంస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా సంస్థ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనే దానిపై ఆయన కృషి చేశారు. అదే విధంగా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెంచడం, రద్దీ ఉండే రూట్లలో బస్సులు ఎక్కువగా పెంచడం వంటివి చేస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది.

TSRTC Electric Buses : భాగ్యనగర రోడ్లపై ఇక నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు.. రయ్‌.. రయ్‌

రాఖీ సందర్భంగాటీఎస్ఆర్టీసీబస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా తీసి బహుమతులు పంపిణీ చేస్తామని నిర్ణయించడంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణించారు. రక్షాబంధన్ పర్వదినాన ఆర్టీసీకి రూ.22 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా రూ.కోటి సమకూరింది అంటే దీని వెనుక ఆ సంస్థ ఉద్యోగుల కృషి ఎనలేనిది. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ఖకు అదనంగా ఆదాయం సమకూరేందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వినూత్నంగా నూతన మార్గాల కోసం పని చేస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థలో ఆదాయం పెంచేందుకు కొత్త కొత్త మార్గాలను తీసుకువస్తున్నారు. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజలకు రవాణా వ్యవస్థను మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. మరోవైపు సంస్థ ఉద్యోగులు కూడా అంకిత భావంతో పని చేయడం వల్లే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు.

రద్దీ ఆధారంగా ఛార్జీల ధరలు.. త్వరలో తీసుకొస్తున్న ఆర్టీసీ

RTC MD Sajjanar: మీ వాహనాలను పక్కనపెట్టి ఆర్టీసీలోనే ప్రయాణించండి: సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details