తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2020, 7:57 PM IST

ETV Bharat / state

మళ్లీ ఎంసెట్ పరీక్ష.. సర్కార్ కీలక నిర్ణయం!

కరోనా కారణంగా ఎంసెట్ రాయలేకపోయిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి మళ్లీ ఎంసెట్ రాసే అవకాశం కల్పించింది.

Telangana eamset 2020
మళ్లీ ఎంసెట్ పరీక్ష.. సర్కార్ కీలక నిర్ణయం!

కరోనా వల్ల ఎంసెట్​ రాయలేక పోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్​ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులు ఈనెల 5 వరకు వివరాలు సమర్పించాలని ఎంసెట్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ గోవర్ధన్​ తెలిపారు.

ఆగష్టు 17 నుంచి సెప్టెంబరు 14 మధ్య కరోనా సోకి.. ఆ కారణంగా ఎంసెట్​ రాయలేక పోయిన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కరోనా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు, హాల్​టికెట్​తో పాటు.. వెబ్​సైట్​లోని అండర్ టేకింగ్​ను సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు convenertseamcet2020@jntuh.ac.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపించాలని కన్వీనర్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి:సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

ABOUT THE AUTHOR

...view details