గతంలో కాంగ్రెస్ గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేలనే సీఎం కేసీఆర్ కొన్నారని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇప్పుడు బేగం బజార్ కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరడం విచిత్రం ఏమి కాదన్నారు. అందరికీ డబ్బులు ఆశ చూపి లాక్కుంటున్నారని.. వారిని కూడా ఎత్తుకుపోయే సమయం త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.
హిమాయత్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూవ్వడి ఇందిరారావు తరపున.. అంజన్ కుమార్ రాజామోహల్లా ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. గతంలో ఓడిపోయినప్పటికీ ప్రజల సమక్షంలో ఉండి ఇందిరా రావు.. ప్రజలకు సేవా చేశారని గుర్తు చేశారు.