పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సనత్నగర్ నియోజకవర్గంలోని అంబేడ్కర్నగర్, జీవైఆర్ కాంపౌండ్, బండ మైసమ్మనగర్, చాచా నెహ్రూనగర్, పొట్టి శ్రీరాములునగర్, గొల్ల కొమరయ్య కాలనీల్లో 105.46 కోట్ల రూపాయల వ్యయంతో 1,258 ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాంగోపాల్పేట డివిజన్లో 330 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా 80 శాతం పనులు జరిగాయని, 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.