ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరులో పురాతన శివాలయాన్ని గుర్తించారు. గ్రామంలో పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రెండెకరాల భూమిని సేకరించారు. ఆ ప్రాంతంలో మార్గం కోసం కూలీలు శనివారం ముళ్లచెట్లు తొలగిస్తుండగా దేవాలయం వెలుగుచూసింది. అందులో రెండు శివలింగాలు, నంది, దేవత విగ్రహాలున్నాయి.
ఇళ్ల స్థలాల కోసం తవ్వితే.. పురాతన శివాలయం బయటపడింది - ancient Shiva temple in repalle news
వందల ఏళ్లనాటి శివాలయం బయటపడింది. పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు భూములు సేకరించారు. ఆ ప్రాంతంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగిస్తుండగా దేవాలయం బయటపడింది. దీనితో అక్కడి గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేశారు.

ఇళ్ల స్థలాల కోసం తవ్వితే.. పురాతన శివాలయం బయటపడింది
సమాచారం తెలుసుకొన్న గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆలయం 300 వందల ఏళ్ల నాటిది అయిఉండొచ్చని గ్రామంలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చవదవండి:పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు