తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 10:34 AM IST

Updated : Oct 27, 2023, 12:47 PM IST

ETV Bharat / state

Amit Shah at 75th Batch IPS Passing Out Parade : 'ప్రజాధికారాలను సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా.. త్వరలో నేర చట్టాల బిల్లుకు ఆమోదం'

Amit Shah at 75th Batch IPS Passing Out Parade in Hyderabad : 75వ బ్యాచ్​ ఐపీఎస్​ ట్రైనీలు శిక్షణా కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్​లో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ముఖ్య అతిథిగా వచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది ఐపీఎస్​లకు తమ సందేశాన్ని ఇచ్చారు. త్వరలోనే ఆంగ్లేయుల మూడు చట్టాలను మార్పు చేసి.. కొత్త చట్టాలతో భారత్​ ముందుకు సాగుతోందని తెలిపారు.

Amit Shah Telangana Tour
Amit Shah Speech Police Pared Ground in Hyderabad

Amit Shah at 75th Batch IPS Passing Out Parade ప్రజాధికారాలను సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా.. త్వరలో నేర చట్టాల బిల్లుకు ఆమోదం

Amit Shah at 75th Batch IPS Passing Out Paradein Hyderabad: వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు నేడు భారత్​లో సవాళ్లు విసురుతున్నాయని అమిత్​ షా పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థికవ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని.. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలని సూచించారు. శిక్షణ పూర్తైన ఐపీఎస్​లు ఈ సమస్యలపై పోరాడతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

75th Batch IPS Passing Out Paradein Hyderabad :హైదరాబాద్​లోని నేషనల్​ పోలీస్​ అకాడమీలో 75వ బ్యాచ్​ ఐపీఎస్​ల పాసింగ్​ అవుట్ పరేడ్​లో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్​ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ బ్యాచ్​లో శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది ట్రైనీ ఐపీఎస్​లకు కృతజ్ఞతలు తెలిపారు. టాపర్​గా నిలిచిన కాలియాకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపీఎస్​ల(Trainee IPS)ను కేటాయించారు.

Trainee IPS Parade in Hyderabad : రేపు ట్రైనీ ఐపీఎస్​ల పాసింగ్​​ పరేడ్​.. ముఖ్య అతిథిగా అమిత్​ షా

Amit Shah Telangana Tour: ఆంగ్లేయుల కాలం నాటి 3 నేర చట్టాలు సీఆర్‌పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్​ను మార్చాల్సి ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి.. పార్లమెంటు ముందు ఉంచిందని గుర్తు చేశారు. త్వరలోనే నేర చట్టాలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందుతుందని అమిత్​ షా అన్నారు. ఆంగ్లేయుల చట్టాలు పోయి.. భారత్​ చేసిన కొత్త చట్టాలతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశమని..ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశమని వివరించారు.

"దేశం శతాబ్ది ఉత్సవాల్లో ఉన్నప్పుడు ప్రస్తుత ట్రైనీ ఐపీఎస్​లు కీలక స్థానాల్లో నిలబడతారు. దేశం రుణం తీర్చుకోవటానికి మీకు ఎంతో మంచి అవకాశం లభించింది. దేశాన్ని ప్రపంచంలోనే ముఖ్య స్థానంలో నిలపడానికి మీకు సదవకాశం వచ్చింది. దేశాన్ని రాబోయే 25ఏళ్లలో ప్రపంచంలో అన్ని రంగాల్లో నిలిపేందుకు ప్రధాని మోదీ ప్రణాళిక రచించారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరంతా మీవంతు పాత్ర పోషించాలి. ఎన్పీఏ ఏర్పడిన 75 ఏళ్లలో ఎంతో మంది ఐపీఎస్​లకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని దేశానికి సేవ అందించారు." - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

Trainee IPS Parade in Hyderabad: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. ఐపీఎస్​ శిక్షణ పొందిన వారిలో మహిళలు ఉన్నారని అమిత్ షా(Amit Shah) తెలిపారు. ఎన్నో సంఘర్షణల తర్వాత భారత్​కు స్వాతంత్య్రం వచ్చిందని.. మహానుభావుల బలిదానాల ద్వారా స్వాతంత్య్రం లభించిందని చెప్పారు. నేడు విశ్వయవనికపై భారత్​ సత్తా చాటుతోందని ఉద్ఘాటించారు. కర్తవ్య నిర్వహణలో 36 వేలకు పైగా పోలీసులు బలిదానాలు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం సూర్యాపేటలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు.

Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్‌ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'

Telangana Liberation Day Celebrations 2023 : పరేడ్​ గ్రౌండ్స్​లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Last Updated : Oct 27, 2023, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details