తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలి: పరశురామ్

కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని అంబెడ్కర్ ఫొటో సాధన సమితి డిమాండ్ చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్​కు సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 24, 2021, 1:30 PM IST

Ambedkar Photo samithi demands printing of BR Ambedkar photo on currency notes in hyderabad
అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలి: పరశురామ్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే విధంగా పార్లమెంట్​లో బిల్లు పెట్టాలని... 'అంబెడ్కర్ ఫొటో సాధన సమితి' డిమాండ్ చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్​కు సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురామ్ హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్​లో తమ వాణి వినిపించేందుకు ఈ నెల 25 నుంచి 30వరకు దిల్లీ యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టి, ముఖద్వారం వద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పరశురామ్​ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details