తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసేమియా వ్యాధి గ్రస్తులకు అల్వాల్​ పోలీసుల రక్తదానం - latest news of blood donation camp at alwal

తలసేమియా వ్యాధి గ్రస్తులకు చేయూతగా హైదరాబాద్​ అల్వాల్​ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీస్​ సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.

alwal police blood donation camp in hyderabad
తలసేమియా వ్యాధి గ్రస్తులకు అల్వాల్​ పోలీసుల రక్తదానం

By

Published : Jul 3, 2020, 4:43 PM IST

తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు పేట్ బషీర్​బాగ్​ ఏసీపీ నరసింహారావు తెలిపారు. హైదరాబాద్​ అల్వాల్​లోని వీబీఆర్ గార్డెన్​లో ఇన్​స్పెక్టర్ పులి యాదగిరి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అల్వాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మానవతా దృక్పథంతో తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తాన్ని అందించాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీసులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభ పరిణామమని దాతలకు ఏసీపీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details