తెలంగాణ

telangana

ETV Bharat / state

బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన - సైఫాబాద్​లో ఎల్ఐసీ ఉద్యోగుల నిరసన

కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థను వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్​లో ఐపీవోకు తీసుకురావాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆల్​ ఇండియా ఎంప్లాయిస్​ ఇన్సూరెన్స్​ ఆసోసియేషన్​, ఎల్​ఐసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక రోజు సమ్మెలో భాగంగా హైదరాబాద్​ సైఫాబాద్​లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

All india insurance employees association dharna on  the FDIs are in insurance sector  in saifabad in hyderabad
బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన

By

Published : Mar 18, 2021, 3:44 PM IST

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్​ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్​ ఆసోసియేషన్, ఎల్​ఐసీ ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం బీమారంగ సంస్థ ఎల్​ఐసీ విలువను వాటాలుగా విభజించి ఐపీఓకు లిస్టింగ్​ చేయాలన్న ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక రోజు సమ్మెలో భాగంగా హైదరాబాద్​ సైఫాబాద్​లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు

పాలసీదారుల ప్రయోజనాలను కాపాడడానికి తాము ఒక రోజు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఎల్​ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన నిర్ణయమన్నారు. 24 ఏళ్లుగా మారుమూల ప్రాంతాలకు విస్తరించి దేశ మౌలిక రంగాల అభివృద్ధి కోసం సంస్థ నిధులను సమకూర్చిందని తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు నిలయమైన ఎల్ఐసీని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరారు. బీమారంగంలో తక్షణమే విదేశీ పెట్టుబడులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

ABOUT THE AUTHOR

...view details