తెలంగాణ

telangana

ETV Bharat / state

చేతి వృత్తిదారులంతా సంఘటితం కావాలి: సీతారాములు - today news chakali ailamma

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ 35వ వర్థంతి సభను చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం ఐలమ్మ విరోచితంగా పోరాడారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలు కృషి చేయాలని సూచించారు.

చేతివృత్తిదారులంతా సంఘటితం కావాలి: చెరుపల్లి సీతారాములు
చేతివృత్తిదారులంతా సంఘటితం కావాలి: చెరుపల్లి సీతారాములు

By

Published : Sep 10, 2020, 7:40 PM IST

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ 35వ వర్థంతి సభను చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తన భూమిని రక్షించేందుకు ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ... పాలకుర్తి గ్రామంలో నిరంకుశ పాలకుడు విసునూరు దేశ్​ముఖ్​కు వ్యతిరేకంగా భీకరంగా పోరాడినట్లు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గుర్తుచేసుకున్నారు.

ఇప్పటికీ అణచివేత కొనసాగింపు..

నేటికీ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీనవర్గాలపైన అణచివేత, దోపిడీ కొనసాగుతోందన్నారు దీనికి వ్యతిరేకంగా వృత్తిదారులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

చేతివృత్తులన్నీ కుదేలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో చేతివృత్తులన్నీ కుదేలైపోయాయని ఎస్​పీకే కార్యదర్శి వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో యాంత్రీకరణ పెద్ద ఎత్తున వృత్తులోకి వస్తోందన్నారు. కార్పొరేట్ మార్కెట్ మాయాజాలంలో వృత్తులన్నీ దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా అన్ని వృత్తులకు ఆధునిక శిక్షణ ద్వారా వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం..

ఐలమ్మ పోరాటం పేద ప్రజలకు, మహిళలకు స్ఫూర్తిదాయకమని చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ కొనియాడారు. ఆనాడు పోరాడి సాధించుకున్న హక్కులు, భూసంస్కరణల చట్టాన్ని 70 ఏళ్ల కాలంలో తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. నేటికీ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీనవర్గాలపైన అణచివేత, దోపిడీ కొనసాగుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా వృత్తిదారులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

రుణాలు ఇస్తామని చెప్పి...

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు వృత్తిదారులందరికీ వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు ఇస్తామని చెప్పి విఫలమైందని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 5 లక్షల 70 వేల మంది దారఖాస్తులు రాగా.. నేటికీ రుణాలు అందించలేదని దుయ్యబట్టారు. కరోనాతో చేతి వృత్తులన్నీ అతలాకుతలం అయ్యాయని మత్ససహకార సంఘం నేత కొప్పు పద్మ బెస్త ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ వృత్తిదారుడికి పదివేల రూపాయల నగదు, 10 కేజీల బియ్యం వెంటనే అందించాలని పద్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్సకార సంఘాలు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కంగనా రనౌత్​పై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details