విజయదశమిని పురస్కరించుకుని బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈసారి ఆయన కూమార్తే విజయలక్ష్మి గురువారం నిర్వహించారు. హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయ నియమితులు కావడం వల్ల ఈ బాధ్యతను ఆమె తీసుకున్నారు. జలవిహార్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
పాటలతో సందడి చేసిన రసమయి
అంతకుముందు నిర్వహించిన వివిధ కళారూపాల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా పాటలు పాడి అలరించారు. గిరిజనులు, కోయ, గోండ్లు తమ తమ వేషధారణలతో... నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. బోనాలు, బతుకమ్మ ఆటలతో మహిళలు, యువతులు సందడి చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ కళాకారులతో కలిసి డోలు చప్పుళ్ల మధ్య ఆడిపాడారు.