తెలంగాణ

telangana

'నిర్భయ దోషులెమైనా దేశ భక్తులా.. ఎందుకు కాపాడుతున్నారు'

By

Published : Mar 18, 2020, 8:51 PM IST

నిర్భయ దోషుల కేసు విషయంలో దోషుల తరఫు న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై అఖిల భారత జన్​సంఘ్ మండిపడింది.

Akhila bharatha jan sangh on nirbhaya victims
'వారు ఏమైనా దేశభక్తులా? ఎందుకు అడ్డుపడుతున్నారు?'

'వారు ఏమైనా దేశభక్తులా? ఎందుకు అడ్డుపడుతున్నారు?'

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానిస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన నిర్భయ న్యాయవాదులను వెంటనే డిస్మిస్‌ చేయాలని అఖిల భారతీయ జన్​సంఘ్‌ డిమాండ్‌ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. న్యాయ పరిధిలో దాదాపు 8 ఏళ్లుగా విచారణ జరిగి... ఇప్పుడు శిక్ష పడితే ఎందుకు అడ్డుకుంటున్నారని అఖిల భారతీయ జన్​సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. వీరు ఏమైనా దేశభక్తులా? లేకపోతే సంఘసేవకులా? ఎందుకు వారిని కాపాడాలని అరాటపడుతున్నారని నిలదీశారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయశాఖ మంత్రికి, అఖిల భారతీయ బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిర్భయ న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.

ఇదీ చదవండిఃగుట్టు వీడింది... కరోనా వైరస్​ పుట్టింది అలానే...

ABOUT THE AUTHOR

...view details