కరోనాతో ప్రజలు సతమతమవుతున్న విపత్కర పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరగడంపై కాంగ్రెస్ మండిపడింది. ఉపాధి కరువై, జీతాల్లో కోతతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంచడం ఏమిటని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసుగా 14వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సంక్షోభంలోనూ ధరల పెంపా?: వంశీచంద్ రెడ్డి - ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి సాధారణ మానవుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
![కరోనా సంక్షోభంలోనూ ధరల పెంపా?: వంశీచంద్ రెడ్డి AICC Secretary Vamsichand Reddy Fires on BJP Government Because of Petrol rates Hike in Country](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7704079-1069-7704079-1592683596830.jpg)
కరోనా సంక్షోభంలోనూ ధరల పెంపా?
లీటరు పెట్రోల్పై రూ.32.98 ఎక్సైజ్ సుంకం, డీజిల్ పై రూ. 31.82 వేసి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న ఆయన ఈ ఖరీఫ్ సీజన్లో రైతులపై అదనంగా ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.