యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధుయాస్కీ శుభాకాంక్షలు తెలిపారు. 9 ఆగస్టు 1942 రోజున మహాత్మగాంధీ నాయకత్వాన క్విట్ ఇండియా నినాదంతో బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి పారదోలారని మధుయాస్కీ వివరించారు.
యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధుయాస్కీ శుభాకాంక్షలు
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధుయాస్కీ శుభాకాంక్షలు తెలిపారు.
యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధుయాస్కీ శుభాకాంక్షలు
ఆరేళ్లుగా దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాకంటక పాలన చేస్తూ.. ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. యువజన కాంగ్రెస్ నేతలంతా తెలంగాణలో తెరాస పాలనను పారదోలేందుకు ప్రతిన చేయాలని మధుయాస్కీ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.