హైదరాబాద్లోని బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలండర్లను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తుల నిల్వల కోసం గోదాముల సంఖ్య పెంచుతామని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా గోదాముల నిర్వాహణ, సేవలు అందించడంలో సిబ్బంది మరింత కృషి చేయాలని మంత్రి సూచించారు.
గోదాముల సంఖ్య పెంచుతాం: నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తుల నిల్వల కోసం గోదాముల సంఖ్య పెంచుతామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలండర్లను ఆవిష్కరించారు.
గోదాముల సంఖ్య పెంచుతాం: నిరంజన్ రెడ్డి
అధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు, టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'రామరాజ్య స్థాపన జరగాలంటే రామమందిరం నిర్మించాల్సిందే'