తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలి: నిరంజన్​రెడ్డి - కిసాన్ అగ్రి ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి

Niranjan Reddy Inaugurated Kisan Agri Show 2023: హైదరాబాద్​లోని మాదాపూర్ హైటెక్స్​లో జరగనున్న కిసాన్ అగ్రి ప్రదర్శన-2023ని మంత్రి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్​లో దేశం నలుమూలల నుంచి వచ్చి 150 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Niranjan Reddy Inaugurated Kisan Agri Show 2023
Niranjan Reddy Inaugurated Kisan Agri Show 2023

By

Published : Mar 3, 2023, 4:05 PM IST

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టాలి: నిరంజన్​రెడ్డి

Niranjan Reddy Inaugurated Kisan Agri Show 2023: దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కేంద్రం ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని పెడచెవిన పెడుతోన్న కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్​లో 3 రోజుల పాటు జరగనున్న కిసాన్ అగ్రి ప్రదర్శన-2023ని మంత్రి తన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాబార్డ్ విశ్రాంత ఛైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో దేశం నలుమూలలకు చెందిన 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో అత్యాధునిక వరి నాటు, కోత, నూర్పిడి యంత్రాలను మంత్రి తిలకించారు. పలు కొత్త యంత్రాలు, ట్రాక్టర్లను ప్రారంభించారు.

Kisan Agri Show 2023 in Hyderabad: రైతుల సౌకర్యార్థ్యం ఫాం సాథీ అంకుర సంస్థ ఆవిష్కరణ కలుపుతీసే రోబో టెక్నాలజీని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు స్టాళ్లు కలియతిరిగి పరిశీలించారు. వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు రాయితీలు ఇవ్వడం అంటే జాతి సంపద సృష్టించడమేనని అన్నారు.

ఆనాడు వ్యవసాయం చేయాలంటే రైతుల కళ్లలో నీరు వచ్చేదని.. ఇవాళ కేసీఆర్ పాలనలో ప్రతి రైతు పొలానికి సాగునీరు వచ్చిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి రాజీవ్ రహదారి నుంచి చెర్ల అంకిరెడ్డిపల్లి వరకూ రూ.61.80 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఏఎన్ఎం మమతను సత్కరించాలి:ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పల్లె చెరువు మరమ్మత్తు పనులు త్వరలోనే ప్రారంభం చేస్తామన్నారు. వారంలో కాళేశ్వరం-రంగనాయక సాగర్ నీళ్లు తెచ్చి గ్రామ పల్లె చెరువు నింపుతామని, పనులు పూర్తయ్యే వరకూ పర్యవేక్షణ చేయాలని జడ్పీ, ఎంపీపీలకు మంత్రి సూచించారు. గ్రామ ఏఎన్ఎం మమత బాగా పని చేస్తున్నారని అభినందించారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆమెను సత్కరించాలని ఆర్డీవో అనంతరెడ్డికి మంత్రి సూచించారు. ఆశా కార్యకర్తలు నార్మల్ డెలివరీలు చేయించేలా ప్రత్యేక దృష్టి పెట్టి గర్భిణీలకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details