బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ విజయవాడలో కోరారు. ఈ మేరకు ఏపీవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు.
తమను చిన్నచూపు చూడడం తగదు: అగ్రిగోల్డ్ బాధితులు - ఏపీ వార్తలు
తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
![తమను చిన్నచూపు చూడడం తగదు: అగ్రిగోల్డ్ బాధితులు agri gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8968277-1008-8968277-1601285456116.jpg)
తమను చిన్నచూపు చూడడం తగదు: అగ్రిగోల్డ్ బాధితులు
నేటికి బాధితులకు కేవలం రూ. 239 కోట్లు మాత్రమే అందించగా... రెండవ బడ్జెట్లో రూ. 200 కోట్లను మాత్రమే కేటాయించటంలో మర్మమేమిటని ప్రశ్నించారు. పేదలకు వేల కోట్లు పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం... తమపై చిన్నచూపు చూడటం సరికాదన్నారు.