తెలంగాణ

telangana

ETV Bharat / state

మధులిక కోలుకున్న తర్వాతే పరీక్షలు

బర్కత్​పురా దాడి ఘటనలో బాధిత బాలిక హెల్త్​ బులిటెన్​ విడుదలైంది. మధులికకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆమె తండ్రి రాము స్పష్టం చేశారు. బాలిక ఇంటర్​ పరీక్షలకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు.

By

Published : Feb 13, 2019, 10:25 PM IST

మధులిక వైద్యం గురించి చెప్తున్న తండ్రి రాము

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ముధులిక ఇన్ఫెక్షన్​తో బాధపడుతోందని ఆమె తండ్రి రాము చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఇంటర్​ పరీక్షలపై ఆందోళన చెందొద్దని మనోధైర్యాన్నిచ్చారు. ఎప్పుడు కోలుకుంటే అప్పుడే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం వ్యక్తం చేశారని మధులిక తండ్రి రాము తెలిపారు. బాధితురాలి వైద్యంకోసం ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అంబర్​పేట ఎమ్మెల్యే వెంకటేశ్​ యశోద ఆస్పత్రి మేనెజింగ్​ డైరెక్టర్​కు అందజేశారు.

ప్రభుత్వం సాయం అందించింది

ABOUT THE AUTHOR

...view details