హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గౌలిగూడ, ఇడ్లిగల్లీ, టెలిఫోన్ బస్తీలో నివసించే పేద ప్రజలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. సంస్థ ఛైర్మన్ నంద కిశోర్ బిలాల్ వెయ్యి మంది పేదలకు సరుకులు అందించారు.
వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
లాక్డౌన్తో పనిలేక ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలకు, కూలీలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. గత 38 రోజుల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అదుకుంటోంది. ఇవాళ వెయ్యి మంది పేదలకు అందించారు.
వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
సీఎం కేసీఆర్ అదేశాలమేరకు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో... 38 రోజులుగా పేదలకు నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 29వరకు సరుకుల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.