తెలంగాణ

telangana

By

Published : May 31, 2020, 9:19 AM IST

ETV Bharat / state

మితిమీరిన వేగం.. జీవితాలు ఆగం

లాక్​డౌన్​ వల్ల దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమైన యువత.. సడలింపులతో రోడ్లపైన దూసుకెళ్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జంట నగరాల్లో శనివారం ఒక్కరోజే మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

accidents increasing in telangana after lockdown
మితిమీరిన వేగం.. జీవితాలు ఆగం

లాక్‌డౌన్‌కు ముందు నగర రోడ్లపై రయ్యిన దూసుకెళ్లిన యువత వేగానికి ఆంక్షలు ఒక్కసారిగా కళ్లెం వేశాయి. దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు. సడలింపులతో మళ్లీ పట్టపగ్గాల్లేని పరిస్థితి ఏర్పడింది. మితిమీరిన వేగంతో ప్రమాదాలకు పాల్పడుతూ తాము నష్టపోవడమే కాకుండా.. ఇతరుల జీవితాలను ఆగమాగం చేస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో రెండు రోజుల క్రితం ఓ కారు విభాగినిని ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి.

పట్టపగ్గాల్లేని వేగం వల్ల..

ఇటీవల నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే.. కార్లు, లారీలు తదితర భారీ వాహనాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్లు, లారీ డ్రైవర్లు పరిమితికి మించి వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతుంటే.. ద్విచక్ర వాహనదారులు విన్యాసాలు చేయడమూ మరో కారణమవుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఐటీ కారిడార్‌, ఔటర్‌పై గంటకు 100- 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నారు.

2020లో హైదరాబాద్​ కమిషనరేట్​లో ప్రమాదాలిలా
జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే
ప్రమాదాలు 237 221 179 48 92
క్షతగాత్రులు 248 233 191 47 84
మృతులు 24 24 16 6 15

సమన్వయం ఉంటే..

అక్కడక్కడ రోడ్లు సరిగా లేకపోవడం, తరచూ మరమ్మతుల కోసం రోడ్లను తవ్వి వదిలేయడం తదితర లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే ప్రమాదాలు కొంత తగ్గుముఖంపడతాయి.

సికింద్రాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, బర్కత్‌పుర, చార్మినార్‌, శాలిబండ, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో వీధిదీపాలు లేని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

ABOUT THE AUTHOR

...view details