తెలంగాణ

telangana

ETV Bharat / state

వారికేమి కావొద్దని..!

అతివేగంతో చాలమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఓ వ్యక్తి అతనికి అడ్డువచ్చాడు. ప్రమాదం జరగవద్దనే ఆలోచన.. పక్కనున్న డివైడర్​ మీదకు వ్యాన్​ ఎక్కించేలా చేసింది.

By

Published : Feb 24, 2019, 2:26 PM IST

త్రుటిలో తప్పిన ప్రమాదం

వారికేమి కావొద్దని..!

హైదరాబాద్ రాజ్‌భవన్‌ రోడ్డులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి... ఖైరతాబాద్‌ సిగ్నల్‌ దాటుతున్న డీసీఎంకు అడ్డు వచ్చాడు. గమనించిన డీసీఎం డ్రైవర్... అప్రమత్తమై వ్యాన్​ను డివైడర్‌ మీదకు ఎక్కించాడు. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టొద్దనే.. డివైడర్​ మీదకు మళ్లించానని వ్యాన్​ డ్రైవర్​ తెలిపాడు.

కారు డ్రైవర్ పాదచారుల మార్గంపైకి దూసుకెళ్లడంతో స్వల్పంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న ట్రాఫిక్, విపత్తు నిర్వహణ సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:పూల్​లో విషాదం

ABOUT THE AUTHOR

...view details