తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలస్యమయ్యే అవకాశం

ఎమ్మెల్సీ, లోక్​సభ అభ్యర్థులపై కసరత్తు చేసిన కాంగ్రెస్​.. జాబితాను అధిష్ఠానం ముందు ఉంచింది. భారత్​-పాక్​ ఉద్రిక్త పరిస్థితుల వల్ల అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రాత్రికే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

By

Published : Feb 28, 2019, 12:06 AM IST

గాంధీ భవన్​

అభ్యర్థుల ఎంపికపై ఆలస్యమయ్యే అవకాశం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్​సభ అభ్యర్థుల ఎంపికఇంకా కొలిక్కి రాలేదు.టీపీసీసీ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన జాబితాను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీకి అందజేశారు. కాంగ్రెస్​ అధిష్ఠానం సమావేశమై అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

50 మంది పేర్లున్న జాబితాపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉండడం వల్ల మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఎంపిక జాప్యం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:తెరాస సమావేశాలు వాయిదా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు రేపే చివరి రోజు కావడంతో ఈ రాత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 33 మంది ఆశావహులలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details