తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్షేమ పథకాలే ఆప్​ను గెలిపించాయి' - AAP Victory Due To the welfare Sceems In Delhi

సామాన్య ప్రజల కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆప్​ని గెలిపించాయని ఆ పార్టీ తెలంగాణ శాఖ కన్వీనర్​ బుర్ర రాము గౌడ్​ అన్నారు. హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు.

Delhi AAP Victory Celebration in Hyderabad
ఆమ్‌ ఆద్మీ పార్టీ

By

Published : Feb 11, 2020, 5:34 PM IST

దిల్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయని తెలంగాణ ఆప్​ కన్వీనర్​ బుర్ర రాము గౌడ్​ అన్నారు. సామాన్య ప్రజల కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆమ్‌ ఆద్మీని గెలిపించాయని తెలిపారు. డబ్బులు, మద్యం పంచకుండా విజయం సాధించవచ్చని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు.

దిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. హస్తిన ఫలితాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఇదీ చూడండి :మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details