తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 6:31 PM IST

ETV Bharat / state

రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీఎస్టీ​ నుంచి రాంనగర్​కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు కూలి ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో వీఎస్టీ నుంచి రాంనగర్​కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

A tree fallen on the musheerabad road traffic stopped
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు

రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు

నగరంలో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా వీఎస్టీ​ నుంచి రాంనగర్​కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు అడ్డంగా నేలకొరిగింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో వీఎస్టీ నుంచి రాంనగర్​కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు వర్షం నీరు రోడ్డుపై నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమాచారం జీహెచ్ఎంసీ డీఆర్​ఎఫ్​ పోలీసులకు తెలుపగా.. ఆ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు.

ఇదీ చూడండి :భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details