తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: లక్ష్యానికి దూరంగా ఆరోవిడత హరితహారం - లక్ష్యం చేరుకోని ఆరోవిడత హరితహారం కార్యక్రమం

ఆరో విడత హరితహారం లక్ష్యం చేరలేదు. ఆగస్టు 31 వరకు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్ణయించగా అటవీశాఖ గణాంకాల ప్రకారం 29.86 కోట్ల మొక్కలకుగానూ అప్పటికి 23.46 కోట్ల మొక్కలే నాటారు. లక్ష్యంలో ఇది 78.64 శాతం మాత్రమే అని అధికారులు చెప్తున్నారు.

a story on six term haritha haram program did not reach the target
కరోనా ఎఫెక్ట్​: లక్ష్యం చేరని ఆరోవిడత హరితహారం కార్యక్రమం

By

Published : Sep 2, 2020, 10:24 AM IST

అటవీశాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు 31 వరకు పూర్తికావాల్సిన ఆరోవిడద హరితహారం కార్యక్రమం లక్ష్యం చేరుకోలేదు. గతేడాది చేపట్టిన ఐదో విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటారు. 2020లో దాన్ని 29.86 కోట్లకు కుదించినా లక్ష్యాన్ని చేరలేదు. ‘కరోనా ప్రభావంతోపాటు ఉపాధి హామీ కూలీల కొరత, మొక్కలు దొరక్కపోవడం వంటివి అడ్డంకులు సృష్టించాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు మూసి ఉండటం వల్ల సామూహికంగా మొక్కలు నాటడం ఈసారి బాగా తక్కువైంది. ఇది హరితహారంపై ప్రభావం చూపింది’ అని అధికారులు విశ్లేషిస్తున్నారు.

* శాఖల వారీగా చూస్తే పురపాలకశాఖ నిర్దేశించిన లక్ష్యంలో 43.92 శాతమే పూర్తిచేసింది. పురపాలకశాఖలో భాగమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌, హెచ్‌ఎండీఏ, వరంగల్‌ కార్పొరేషన్లకు విడివిడిగా లక్ష్యాలు నిర్దేశించారు. జీహెచ్‌ఎంసీ 62.73 శాతం, హెచ్‌ఎండీఏ 50.78 శాతం, వరంగల్‌ అర్బన్‌ 42.65 శాతం పూర్తిచేశాయి.

* కామారెడ్డి, మేడ్చల్‌, భద్రాద్రికొత్తగూడెం, వరంగల్‌ గ్రామీణ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, జగిత్యాల జిల్లాలు లక్ష్యాన్ని దాటాయి.

* తమ శాఖకు కేటాయించిన లక్ష్యాన్ని (1.85 కోట్లు) దాటి 1.93 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీశాఖ పేర్కొంది.

ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details