తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన అమ్ముగూడా, అల్వాల్​ బారెక్స్​ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. మృతుడు అల్వాల్​కు చెందిన పొలమల్ల దేశమత్​రావుగా రైల్వే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Sep 11, 2019, 10:38 PM IST

వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన ఘటన అమ్ముగూడా, అల్వాల్​ బారెక్స్​ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. అల్వాల్​కు చెందిన పొలమల్ల దేశమత్​రావు రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో దొరికిన చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details